- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహం ఉద్రిక్తతకు దారితీసింది. పొందూరు మండలం సింగూరు ఇసుక రిచ్ల పరిశీలనకు వెళ్లిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, ఆ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరగడంతో కూన రవికుమార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఇసుక అక్రమాలను పరిశీలిస్తామంటూ ముందుకు వెళ్లిన కూనరవికుమార్ తో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నారని కూనరవికుమార్ ఆరోపించారు.

విజయవాడ కార్పొరేషన్లో అధికార పార్టీ నేతల అవినీతి బట్టబయలు అయింది. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు రావడంతో ఈ బాగోతం బయటపడింది. ఇటీవల విజయవాడ కార్పొరేషన్లో డబ్బులు ఇవ్వనిదే పనులు జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ కొందరు అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరిస్తామంటూ మరికొందరు నేతులు అడ్డంగా దోచేస్తున్నారని విజయవాడ వాసులు ఆరోపిస్తున్నారు. అనధికార నిర్మాణాలపై నజర్ పెట్టి భారీ డబ్బులు వసూలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. వాటల పంపిణీలో తేడాలు రావడంతో స్వంత పార్టీనేతలే ఒకరి బాగోతం ఒకరు బయట పెట్టుకున్నారు.

ఏపీలో ఇసుక దోపిడిపై టీడీపీ పోరుబాట పట్టింది. వైసీపీ నాయకుల ఇసుక అక్రమాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల ఇసుక రీచ్ల పరిశీలనకు వెళ్ళిన టీడీపీ నాయకులను పోలీసులను అడ్డుకున్నారు. చంద్రగిరిలో టీడీపీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అధికారపార్టీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని నేతలు ఆరోపించారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.
అనంతపురం జిల్లా కంబదూరు మండలం కత్తనపర్తి వద్ద పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలను టీడీపీ నాయకులు పరిశీలించారు. ఇసుక రీచ్ వైపు వెళ్తుండగా టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి ఉషా శ్రీచరణ్ ఇసుక దోపిడికి అడ్డు అదుపు లేకుండాపోయిందని మాజీ ఎమ్మెల్యే హనుమంత రాయచౌదరి ఆరోపించారు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గూనాంలో టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. చంపావతి నదిలో యథ్చేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని టీడీపీ నేత కరణం శివరామకృష్ణ ఆరోపించారు. అక్రమ ఇసుక సొమ్ము వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఖాతాల్లోకి వెళ్తున్నాయని చెప్పారు. బొత్స కుటుంబం జిల్లాలో ఇసుక భూములను చెరబట్టిందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనర్హత తీర్పులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కృష్ణమోహన్రెడ్డిని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధించింది. ఇటీవల గద్వాల ఎమ్మెల్యేగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను నియమిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో కృష్ణమోహన్ రెడ్డి సరైన సమాచారం ఇవ్వలేదని డీకే అరుణ వేసిన పిటిషన్పై ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఎమ్మెల్యేపై హైకోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్ అనర్హత వేటు వేశారు.

గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై వాలంటీర్ల ఫిర్యాదు కలకలం రేపుతోంది. తమను ఎమ్మెల్యే దూషించాడంటూ ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇటీవల మన్నవ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను అభివృద్ధి పనులపై గ్రామస్తులు నిలదీశారు. దాంతో మన్నవ సచివాలయానికి తమను పిలిపించి ఎమ్మెల్యే కిలారి రోశయ్య బూతులు తిడుతూ ఇష్టానుసారం మాట్లాడాని వాలంటీర్లు చెబుతున్నారు. గ్రామంలో ఎలాంటి పనులు చేయకుండా అడిగినవారిపై దుర్బాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోశయ్య నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ గణేష్ ఉత్సవాలపై MCHRDలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి హాజరువుతున్నారు.వీరితో పాటు GHMC మేయర్, డిప్యూటీ మేయర్, గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన MLC లు, MLA లు, బాలాపూర్, ఖైరతాబాద్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

ఏపీ వ్యాప్తంగా అక్రమ ఇసుక క్వారీల వద్ద టీడీపీ ఆందోళనకు దిగింది. అక్రమ ఇసుక క్వారీలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినా... ఇసుక రవాణా యథేచ్చగా జరుగుతోందంటున్నారు టీడీపీ నేతలు. దీన్ని అడ్డుకునేందుకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఇసుక క్వారీల వద్ద ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం జువ్వలపాలెంలో మాజీ మంత్రి ఆనందబాబు ఆధ్వర్యంలో ఇసుక క్వారీల వద్ద ఆందోళన చేస్తున్నారు. అక్రమ ఇసుక క్వారీలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ మీనాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తాడికొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తయారీ ఎన్నికల సంఘం నిబంధనల కు విరుద్ధంగా జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. ఒక వార్డులో ఉన్న వాళ్ళను ఒక బూత్ కు కాకుండా 8 వేర్వేరు బూత్ లకు కేటాయించారని వివరించారు. 150 మంది మృతుల ఓట్లను కూడా తొలగించలేదని వెల్లడించారు. సున్నా ఇంటి నెంబర్ తో 53 ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.

తిరుమలలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. నడకమార్గంలో 7వ మైలు వద్ద అర్థరాత్రి బోనులో చిక్కింది. 2 నెలల వ్యవధిలో నాలుగు చిరుతలను బంధించింది అటవీశాఖ. ఇటీవల తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన ఆడ చిరుత చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 197వ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం సుందరరావు పేట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. లింగపాలెంలో స్థానికులతో సమావేశమైన అనంతరం పాదయాత్ర చేపట్టారు. ఇప్పటి వరకు లోకేష్ 2 వేల 624 కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. ఫాతిమాపురం జంక్షన్ లో రైతులతో సమావేశమవుతారు. చింతలపూడి శివార్లతో భోజన విరామనం అనంతరం.. తిరిగి పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి తీగల వంచ శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు.

హైదరాబాద్ రామ్కోఠిలో మెడికల్ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. జీహెచ్ఎంసీ స్వీపర్ సునీతపైకి దూసుకెళ్లింది. దీంతో పారిశుద్ద్య కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అయాన్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్స్ కళాశాలకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న నారాయణ గూడ పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్సు ను సీజ్ చేసిన పోలీసులు, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏకగ్రీవ ఎన్నికకు విపక్షాలు సహకరించాలని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించిన దివంగత నేత సాయన్నపై గౌరవం ఉంటే..ఆయన కూతురు లాస్య నందితకు పార్టీలన్నీ మద్దతు తెలపాలన్నారు. కంటోన్మెంట్లోని లాస్యనందిత నివాసంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి తలసాని హాజరయ్యారు. ఎన్నికలు వస్తే లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్. సమావేశం తర్వాత బోయిన్పల్లిలో యాదవ భవనాన్ని ప్రారంభించారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో వంతెన నిర్మాణం కోసం గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. పూర్ణపాడు- లాభేసు గ్రామాల మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మించాలంటూ.. అరగుండుతో నిరసన తెలిపారు కోమటిపేట గ్రామస్తులు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ 11 రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. వంతెన నిర్మాణం విషయంలో కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తాత్సారం చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల... అత్యవసర పరిస్థితుల్లో నదిని దాటడానికి నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు.

వైసీపీ సర్కార్ విద్యావిధానంపై TSNF ఫైర్ అయింది. పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమ్మఒడి నిధుల్లో కోతపెట్టడం దారుణమని, నవరత్నాలను ఖురాన్, బైబిల్తో పోల్చిన సీఎం జగన్..నవ మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 5లక్షల మంది విద్యకు దూరమైయ్యారని ఆరోపించారు. 2 లక్షల మంది విద్యార్ధులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అందడం లేదని.. దీంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు TSNF నేతలు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బిగిస్ బర్గర్ స్టోర్లో అగ్నిప్రమాదం తర్వాత ఓనర్ పరారయ్యాడు. బిగిస్ బర్గర్ కిచెన్లో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది .. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. బిగిస్ బర్గర్లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ చర్యలు లేవని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. కిచెన్లో ఎలక్ట్రిక్ మిషన్లు ఎక్కువగా వాడటం కూడా మరో కారణమని తేల్చారు. పరారీలో ఉన్న బిగిస్ బర్గర్ ఓనర్పై కేసు నమోదు చేశామంటున్నారు మాదాపూర్ జోన్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఫజల్.

పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాణసంచా కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.

శ్రీకాకుళంలో దారుణ హత్య జరిగింది. కలెక్టర్ బంగ్లా సమీపంలోని SHB కాలోనీలో.. నరసింగరావును హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆస్తి తగదాల కారణంగా ఆయన్ను హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు. దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తి కోసం హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఆస్తు తగదా కేసు.... మూడేళ్లుగా కోర్టులో కేసు నడుస్తుండగా ... హత్యకు గురయ్యాడు నరసింగరావు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటన స్థలానికి చేరుకుని...క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు.

కాంగ్రెస్ ఎస్సీ డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. బెంగళూరు బయలుదేరిన ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టులో పార్టీ ముఖ్యనేతలకు..పలు సూచనలు చేశారు.మైనార్టీ, బీసీ, మహిళా డిక్లరేషన్ను..బలంగా రూపొందించాలని అన్నారు.ఖర్గేను కలిసేందుకు ఉదయం ఆరు గంటల నుంచే కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సూచించారు ఖర్గే. త్వరలో తెలంగాణకు రాహుల్ లేదా ప్రియాంక రానున్నారని, అవసరమైతే మరోసారి రాష్ట్రానికి వస్తానని కాంగ్రెస్ నేతలకు తెలిపారు.

సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని కోమటి చెరువు ఇవాళ మరో అద్భుత ఘట్టానికి వేదికకానుంది. 450 డ్రోన్లతో సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా మెగా డ్రోన్ షో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు వీక్షించనున్నారు. ఇవాళ మంత్రి హరీష్ సమక్షంలో డ్రోన్ షో జరగనుంది. సాయంత్రం డ్రోన్ షో కనువిందు చేయనుంది. భూమి నుంచి వంద మీటర్ల ఎత్తులో కాంతి వెలుగులో సిద్దిపేట అభివృద్ధిని ఆవిష్కరించనున్నారు. సినీ గాయనీ గీతామాధురి బృందం ఆట పాటలతో అలరించనున్నారు.

విశాఖలో జగనన్న బస్ బే కూలిపోయింది. సెంట్రల్ పార్క్ ఎదురుగా నిర్మించిన ఈ బస్సు బేను..హడావుడిగా నాలుగు రోజుల క్రితం ప్రారంభించారు. పనులు కూడా పూర్తి కాకుండానే... మేయర్ చేతుల మీదుగా.. దీన్ని ప్రారంభించారు. అయితే.. ఇవాళ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా బస్ బే కూలిపోయింది. కూలిన సమయంలో.. పలువురు ప్రయాణికీలు బస్ బే కింద ఉన్నారు. అయితే విరిగి శబ్దం రావడంతో.. ప్రయాణీకులు తప్పించుకున్నారు. జగననన్న బస్ బేలు కేవలం ప్రచారానికి తప్ప ఎలాంటి నాణ్యత ఉండటం లేదంటు మండిపడ్డారు విశాఖ వాసులు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...కశ్మీర్లో పర్యటిస్తున్నారు. శనివారం శ్రీనగర్ లోని నగీన్ సరస్సులో బోట్ రైడ్ చేశారు. ఈ సరస్సు అందాలను ఆస్వాదించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ... నైగీన్ సరస్సులోని..... హౌస్ బోటులోనే ఉంటున్నారు. బోట్ రైడ్ అనంతరం.. రైనావారీ ప్రాతంంలోని హోటల్ లో సోనియాగాంధీ బస చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం సోనియా, రాహుల్ ను కలవనున్నారు. ఇక.... ఇవాళ సోనియా కుటుంబం గుల్మాల్ను సందన్శించనున్నారు.

కాసేపట్లో సీపీఎం తెలంగాణ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంఠి రంగారెడ్డి, సీతారాములు సహా ఇతర సభ్యులు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సాయంత్రం వరకు కొనసాగే ఈ మీటింగ్ కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చిందని భావిస్తున్న సీపీఎం నేతలు.. సీపీఐతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పొత్తులు, సీట్ల సర్దుబాటు సహా వివిధ అంశాలపై చర్చించనున్నారు సీపీఎం నేతలు.

సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్లో కొంత మాయం చేసిన ఎస్ఐ.. వాటిని అమ్ముకునేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో.. ఎస్ఐ రాజేందర్ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న టీమ్లో సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ కూడా ఉన్నారు. అయితే.. సీజ్ చేసిన డ్రగ్స్లో కొంత మాయం అయినట్లు గుర్తించిన అధికారులు అతడ్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణలో బీజేపీకి 70 సీట్లు ఖాయమని ఎంపీ అర్వింద్ చెప్పారు. సీట్లు తగ్గినా ఏర్పడేది తమ ప్రభుత్వమేనన్నారు. ధాన్యం కొనుగోళ్లలో చేసిన అవినీతి, అక్రమాలతో బీఆర్ఎస్ మళ్లీ గెలవాలని చూస్తోందని అర్వింద్ ఆరోపించారు. ధాన్యం సేకరణలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ 40 కోట్లు ఇస్తోందని అన్నారు. ఏమైనా రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎంపీ అర్వింద్...భీంగల్ మండలం లింగాపూర్లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

టీటీడీ పాలకమండలిలో జైలుకు వెళ్లి వచ్చిన వారికి చోటు కల్పించడం అపచారమన్నారు...రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. ఆర్ధిక నేరాలలో కూరుకుపోయి బెయిల్పై ఉన్న వారిని టీటీడీ సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ స్వప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు బోర్డులో చోటు కల్పించడం సరికాదన్నారు. ఏపీకి చెందిన వ్యక్తులను మాత్రమే బోర్డు సభ్యులుగా నియమించేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలన్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తానన్న తుమ్మల ప్రకటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఇప్పటికే బీఆర్ఎస్ హైకమాండ్ జిల్లాల్లోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తుమ్మల రాజకీయ పయనం ఎటువైపు ఉంటుందన్న చర్చ ఊపందుకుంది. తుమ్మల పార్టీ మారుతారా.. ఏ పార్టీలోకి వెళ్తారు..? స్వతంత్రంగా బరిలో నిలుస్తారా అనే అంశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేస్తానన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

నాగార్జునసాగర్ బీఆర్ఎస్లో అసమ్మతి చిచ్చు చల్లారడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్కు టికెట్ కేటాయించడంతో అసమ్మతి వాదులు భగ్గుమంటున్నారు. త్రిపురారం మండలం, పెద్దదేవలపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి యాదవ సంఘం నాయకులతో పాటు రామ్మూర్తి యాదవ్ కుమారుడు కోటేష్ కూడా హాజరయ్యారు. నాగార్జున సాగర్ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక యాదవులకే టికెట్ కేటాయించాలని అధినేత కేసీఆర్ను కోరుతున్నారు.

సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అప్పు చేసి పేదలకు డబ్బులు ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. పన్నులు రూపేణా రెట్టింపు దండుకోవటం సంక్షేమ పాలనా అని ప్రశ్నించారు. జగన్ నొక్కే బటన్కు కరెంట్ లేదు... ఆ బటన్ ఎన్నిసార్లు నొక్కినా డబ్బులు పడవన్నారు. జగన్ చర్యలతో ఏపీ పరువుపోయిందన్నారు. ఏపీలో ఎక్కడ చూసిన భూ కబ్జాలు, మట్టి దోపిడీనే ఉందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం గెలుపు అనివార్యమని చెప్పారు. నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో లోకేష్ రచ్చబండ నిర్వహించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 52 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా నిజామాబాద్ అర్బన్లో 12 మంది, బాన్సువాడ టికెట్ కోసం 12 మంది ఆశావహులు పీసీసీకి దరఖాస్తు చేశారు. జిల్లాలో ఒక్క చోట కూడా మహిళలు దరఖాస్తు చేయడానికి ముందుకు రాలేదు.

తెలంగాణలో కాంగ్రెస్దే అధికారమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. తమ ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీపై తొలి సంతకం పెడతామన్నారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప... 9 ఏళ్లలో జిల్లాకు ఏమీ చేయలేదన్నారు. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. వెలుగుపల్లికి చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు.

వికారాబాద్ జిల్లా పరిగిలో కాసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేగా జాబ్ మేళాను నిర్వహించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ మేళాను ప్రారంభించారు. జాబ్ మేళాకు నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువతి, యువకులు భారీగా తరలివచ్చారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు మేళాలో పాల్గొన్నారు. నిరుద్యోగుల అర్హతలకు సంబంధించిన ఉద్యోగాలను ఆఫర్ చేశారు. జాబ్మేళా అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కాసాని వీరేష్ పిలుపునిచ్చారు. పరిగి ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నారు. వందకుపైగా కంపెనీలతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం మరో మైలురాయికి చేరుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం పోతిరెడ్డిపల్లిలో 195వ రోజు ప్రారంభమైన పాదయాత్ర... ముసునూరు మండలం సింహాద్రిపురం వద్ద 2600 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు నీరందిస్తామని చెప్పారు.

ఎన్నికల సర్వేలపై మీడియా చిట్చాట్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే- సీ ఓటర్ సర్వే పై స్పందిస్తూ నెల రోజుల్లో టీడీపీ గ్రాఫ్ మరింత పెరుగుతుందన్నారు. ప్రజలు అభిప్రాయాలు వెల్లడించడానికి ఇంకా భయపడుతున్నారని అన్నారు. ప్రజలు భయం వదిలి స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి ఉంటే సర్వేలో టీడీపీకి ఉన్న ఆదరణ ఏంటో మరింత క్లారిటీ వచ్చేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలను జగన్ ఎంతగా నమ్మించే ప్రయత్నం చేసినా టీడీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు అన్నారు. రానురాను ప్రభంజనంగా మారడం ఖాయమన్నారు.

రెండు నెలలుగా ఆకాశాన్నంటిన టమాట ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్కు సుమారు 10టన్నుల టమాటను తీసుకొచ్చారు. వేలంలో క్వింటాల్ టమాట వెయ్యి కంటే తక్కువ ధరే పలికింది. అయితే కిలోకి 10 రూపాయలు కూడా దక్కలేదని రైతులు వాపోయారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడంతో ధరలు పతనమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్లో వినయోగదారులు మాత్రం కిలో టమాట 40 రూపాయలు పెట్టి కొంటున్నారు.

TTD బోర్డు మెంబర్ పదవి లిక్కర్ కేసు నిందితుడికి ఇవ్వడంపై మండిపడ్డారు బీజేపీ నేత లంకా దినకర్. టీటీడీ అంటే పవిత్రతకు మారుపేరని.. పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా నిందితుడా అంటూ మండిపడ్డారు. అన్యమత సంప్రదాయంలో కూతురి పెళ్లిచేసిన వ్యక్తికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టిన సీఎం.. ఇప్పుడు పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా లిక్కర్ నిందితుడికి కట్టబెట్టారని విమర్శించారు. రాజకీయ పునరావాసంలో భాగంగా పదవులు కట్టబెట్టారని, సీఎం సామాజికవర్గానికే అయిదో వంతు పదవులు కేటాయించారిని ఆరోపించారు.

విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. బీఆర్టీఎస్ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం వద్ద అదుపు తప్పి స్కూలు పిల్లలపైకి దూసుకెళ్లింది. ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల వైఫల్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


