చిట్టి న్యూస్

YAGAM: చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని యాగం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కృష్ణా జిల్లా కానూరులో ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు సుదర్శన నరసింహ స్వామి యాగం నిర్వహించారు.


నేపాల్‌కు చెందిన రుత్వికులు హోమం చేశారు. చంద్రబాబుపై CID నమోదుచేసిన కేసుల నుంచి విముక్తి లభించాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని సంకల్పించారు. ఈ యాగంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



AP: పోలీసుల వేధింపులతో దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం

పోలీసుల వేధింపులు తాళలేక బాపట్ల జిల్లా కోళ్లపాలెంకు చెందిన మేరుగ కిరణ్ కుమార్ అనే దివ్యాంగుడు ఆత్మహత్యకు యత్నించాడు. పరారీలో ఉన్న తండ్రి కిశోర్ ఆచూకీ చెప్పాలని కొల్లూరు SI రాజ్యలక్ష్మి వేధించారని కిరణ్ ఆరోపించాడు. చంద్రబాబు బెయిలుపై విడుదలైన సమయంలో రామకృష్ణ, యశ్వంత్ అనే వ్యక్తుల మధ్య సామాజిక మాధ్యమాల్లో వాగ్వాదం జరిగిందని ఆ సమయంలో తన తండ్రి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారని కిరణ్ తెలిపాడు. తర్వాత యశ్వంత్ ఫిర్యాదుపై రామకృష్ణ, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి నుంచి తన తండ్రి ఇంటికి రావడంలేదని కిరణ్ వివరించాడు. తర్వాత తనను స్టేషన్ కు పిలిపించిన S.I రాజ్యలక్ష్మి కొట్టడమే కాకుండా కేసు పెడతానని బెదిరించినట్టు కిరణ్ వాపోయాడు. ఈ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి కిరణ్ ఆత్మహత్యకు యత్నించినట్లు తల్లి ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని తెలుగుదేశం నేత నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు. 

AP HC: ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అక్రమంగా నిర్బంధించడం మానవహక్కుల ఉల్లంఘనే అని స్పష్టం చేసింది. వేదాయపాలెం పోలీసుల అక్రమ నిర్బంధంపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం సీఐ, ఎస్ ఐలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు జైల్లో ఉన్నప్పటి ఫొటోతో నిందితుడి భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అక్టోబర్ 25న తన భర్తను తీసుకెళ్లి నవంబర్ 8న కేసు నమోదు చేశారని నిందితుడి భార్య ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మోసం కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని రోజులపాటు ఎందుకు నిర్బంధించారని.. హైకోర్టుప్రశ్నించింది. భార్యాపిల్లలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై చర్యలకు తగిన వేదికకు వెళ్లేందుకు.... పిటిషనర్ కు ధర్మాసనం వెసులుబాటు కల్పించింది.

CBN: చంద్రబాబు బెయిల్‌పై నేడు విచారణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ కోసం టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ప్రధాన బెయిలు పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేస్‌ హైకోర్టు విచారణ జరపనుంది. నిందితులందరూ ఇప్పటికే రెగ్యులర్‌, ముందస్తు బెయిలు పొందడం.. ఇదే కేసులో 37వ నిందితుడైన చంద్రబాబుకు మాత్రం బెయిలు దక్కకపోవడంపై న్యాయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన నిందితులు బెయిలు పొందాక మిగిలిన నిందితులకు బెయిలు దక్కడం సర్వసాధారణమని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ పూర్వ ఎండీ, మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిలు పొందారు. స్కిల్‌ సంస్థ కేసులో చంద్రబాబు ఒక్కరికే బెయిలు రావాలని, ఇదే కేసులో ఆయన 52 రోజులు జ్యుడిషియల్‌ కస్టడీలో గడిపారని, మిగిలిన నిందితులెవరూ లేనంత కాలం చంద్రబాబు జైల్లో ఉన్నారు.

తన బెయిలు పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. శుక్రవారం ప్రధాన బెయిలు పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో న్యాయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Mumbai : టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం…ముగ్గురి మృతి

ముంబయిలోఓ కారు  బీభత్సం సృష్టించింది.  గురువారం రాత్రి  ముంబయిలోని వర్లీ నుంచి ఉత్తర దిశగా బాంద్రా వైపు వెళుతున్న ఒక కారు టోల్ ప్లాజా వద్ద పార్క్ చేసిన వరుస  కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు  అక్కడికక్కడే మరణించగా  ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సీ లింక్‌లో ఉన్న టోల్ ప్లాజాకు 100 మీటర్ల ముందు మొదట మెర్సిడెస్ కారును ఢీకొట్టిందని, ఆ తర్వాత మరో రెండు మూడు వాహనాలను ఢీకొట్టిందని స్థానిక  డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ వెల్లడించారు. ఈ ఘటనలో మెర్సిడెస్, ఇన్నోవా సహా మొత్తం 6 కార్లు ప్రమాదానికి గురయ్యాయని వివరించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో నలుగురి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. గాయపడిన వారిలో ఇన్నోవా కారు డ్రైవర్ కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Chandrababu: ఫైబర్ నెట్ కేసులో  ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు.

అలాగే ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలని, వేధించాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. 'వైసిపి పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతిపై నేను, ఇతర ప్రతిపక్ష నేతలు గళమెత్తుతున్నాం. మా నోళ్లు మూయించాలనే కేసు పెట్టారు. మేం ప్రభుత్వ అక్రమాలపై గొంతెత్తుతున్న అంశాలను ముడిపెట్టి మాపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ప్రతీకారానికి పాల్పడుతోంది' అని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

AP CM : జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిని పిల్‌గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. జగన్‌ ఆస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌పై హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ చేశారు. పిల్ లో సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించింది. పిల్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ప్రతివాదులు జగన్, సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య కోరారు.

RRR: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జైలర్‌ సీన్‌

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో తలైవా రజినీకాంత్‌ నటించిన జైలర్‌ సినిమా సీన్‌ త్వరలో కనిపించవచ్చని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలర్‌ చిత్రంలో రజినీకాంత్‌ పోలీస్‌ ఉన్నతాధికారిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న కుమారుడు దొంగతనాలు చేస్తున్న విషయం తెలిసి అతన్ని చంపాలని ఆదేశిస్తారని..ఏపీలోనూ అలాంటి ఘటన పునరావృతం కావచ్చన్నారు. ఇప్పటికే సీఎం జగన్‌ నిజ స్వరూపం తండ్రి లాంటి మోడీకి తెలిసి ఉండొచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు జగన్‌ తన పేరునో లేదా తన తండ్రి పేరునో పెట్టుకోవడం విచిత్రంగా ఉందన్నారు. పీఎం కిసాన్‌ పథకానికి వైఎస్సార్‌ రైతు భరోసా అని ఏపీ ప్రభుత్వం నామకరణం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను జగన్ ప్రభుత్వం మారుస్తున్నట్లు తెలుసుకొని 5 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపేసిందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి ప్రచారం కల్పించే ప్రకటనల్లో ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో, మరో వైపు ముఖ్యమంత్రి ఫొటో వేసుకోవచ్చన్నారు. అలా కాకుండా జగన్‌ తన జేబులో నుంచి నిధులు ఖర్చు చేస్తున్నట్లు తన తండ్రి ఫొటో, తన ఫొటో ముద్రించుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దగ్గుబాటి పురందేశ్వరిపై తమ పార్టీ నాయకులు కూస్తున్న కారు కూతలు వింటే బాధనిపిస్తోందని తెలిపారు.

AP HC: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ కేసులో C.I.D అధికారులు గతంలో ACB కోర్టులో P.T. వారెంట్ దాఖలు చేశారు. P.T.వారెంట్ పై దిగువ కోర్టులో విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై ఉత్తర్వులు పెండింగ్ లో ఉన్నాయని... 17A రింగ్ రోడ్డు కేసుకు కూడా వర్తిస్తుందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉచిత ఇసుక పథకంపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై కేసు నమోదు చేయటం సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లిందని A.P.M.D.C డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. రేపు హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

BABU: చంద్రబాబుకు విజయవంతంగా ఆపరేషన్

BABU: చంద్రబాబుకు విజయవంతంగా ఆపరేషన్

JAGAN: పుట్టపర్తిలో వైసీపీ నేతల బరితెగింపు

ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా చెట్లు నరకడం, ఆంక్షలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం పర్యటన ప్రభావం విద్యావ్యవస్థపై కూడా పడింది. జగన్ పర్యటన సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యా శాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పుట్టపర్తిలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి జగన్ వస్తుండగా ఆ సభకు జనసమీకరణ కోసం ప్రైవేట్ పాఠశాల బస్సులను స్వాధీనం చేసుకుని సెలవు ఇచ్చారు. DEO సెలవు ప్రకటించడంపై విద్యార్థి సంఘం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు సత్యసాయి బాబా ఫ్లెక్సీలపైకి ఎక్కి పార్టీ జెండాలు కట్టారు. పట్టణంలో సీఎం పర్యటన లేనప్పటికీ సత్యసాయి బాబా ఫ్లెక్సీలు తీసివేసి వైసీపీ జెండాలు, జగన్ ఫ్లెక్సీలు కట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో పార్టీ జెండాలపై నిషేధం ఉన్నా..అధికారి పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా జెండాలు, ప్లెక్సీలు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

SHARMILA: సజ్జలకైనా.. జగన్‌కైనా ఇదే సమాధానం

తెలంగాణలో తాను కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంపై.. విమర్శలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ మండిపడ్డారు.తెలంగాణలో తాను పార్టీ పెట్టినప్పుడు ఏం సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. ఏపీ పరిస్థితిపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు ముందు సమాధానం ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో భారాసను దింపే శక్తి ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉందని, అందుకే ఆ పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించినట్టు.. షర్మిల స్పష్టంచేశారు. తెలంగాణలో... కాంగ్రెస్ కే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ... తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆమె గుర్తు చేశారు. అన్ని పార్టీల్లో దొంగలుంటారని..... ఆ దొంగలు సీఎంలు కాకూడదని వ్యాఖ్యానించారు. ఎవరో తమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని తెలంగాణ ప్రజల కోసమే ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని షర్మిల అన్నారు. 

UK researchers: 3 నిమిషాల్లో కొవిడ్‌, క్యాన్సర్‌ గుర్తించే పరికరం-యూకే శాస్త్రవేత్తల   అభివృద్ధి

కొవిడ్‌, క్యాన్సర్‌ను 3 నిమిషాల్లో కచ్చితంగా గుర్తించే అత్యంత  చిన్నపాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కొవిడ్‌ టెస్ట్‌’గా ఈ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌ ఇంజినీర్లు అభివర్ణించారు. ముక్కు ద్వారా సేకరించిన శాంపిల్‌ను ‘ల్యాబ్‌ ఆన్‌ ఏ చిప్‌’ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో ఈ పరికరం ద్వారా పరీక్షించి కొవిడ్‌ ఉందో లేదో నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష ఫలితాన్ని స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌లో చూడవచ్చు. మురికి నీటిని ఈ పరికరంలో పరీక్షించి అందులో కొవిడ్‌ తదితర వ్యాధులను, ఇన్ఫెక్షన్లను వ్యాపింపచేసే వైరస్‌లను గుర్తించవచ్చు.

LoCKAmpను  UKలో రెండవ కోవిడ్ వేవ్ సమయంలో ను పరిశోధించడం,  అభివృద్ధి చేయడం ప్రారంభించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. LAMP  డిటెక్షన్ అనేది PCR టెస్టింగ్ కంటే ఎక్కువ సెన్సిటివిటీని కలిగి ఉండటం, వేగవంతమైనది మరియు మరింత నిర్దిష్టమైనది కాబట్టి  ఇది ఉత్తమమని ఈ శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. ముఖ్యంగా, PCR పరీక్షకు అవసరమైన మూడు థర్మల్ సైకిల్స్  కాకుండా, 65° ఒకే స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద దీనిలో  ప్రాసెసింగ్ జరుగుతుంది.అలాగే ఈ  పరికరాన్ని పోర్టబుల్ పరిమాణంలో మరియు తక్కువ విద్యుత్ వినియోగంతో సులభతరం చేయవచ్చు. 

TPCC: పక్కా వ్యూహంతో కాంగ్రెస్‌ అడుగులు

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సర్వశక్తులొడ్డుతున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ... ముగ్గురికి మాత్రం బీఫాంలను తాత్కాలికంగా నిలుపుదలచేసినట్లు తెలుస్తోంది. ఆ3 స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల మార్చే అవకాశమున్నట్లు పార్టీలో చర్చసాగుతోంది. మూడో జాబితా సైతం కొలిక్కి వచ్చినందున నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ప్రకటించిన అభ్యర్థులకు ఆపార్టీ నాయకత్వం బీఫాంలు పంపిణీ చేస్తోంది. రెండు విడతల్లో 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా బీఫాంతీసుకెళ్లాలని 97 స్థానాలకుచెందిన అభ్యర్థులకు గాంధీభవన్‌ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. వనపర్తి, బోథ్‌, చేవెళ్ల స్థానానికి ప్రకటించిన అభ్యర్ధులకు మాత్రం బీఫాంల సమాచారం ఇవ్వలేదని పార్టీలో చర్చసాగుతోంది. బోథ్‌ నుంచి వెన్నెలఅశోక్‌, వనపర్తి నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి, చేవెళ్ల నుంచి భరత్‌కి టికెట్లు దక్కాయి. ఆ ముగ్గురికి బీఫాం తీసుకెళ్లాల్సిందిగా గాంధీభవన్‌ నుంచి సమాచారం వెళ్లలేదని తెలుస్తోంది. అభ్యర్థులకు చెందిన బీఫాంలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌, ఇన్‌ఛార్జి కార్యదర్శులు, పరిశీలకులు పంపిణీ చేయగా తొలిరోజు 65మందికి అందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


రెండోజాబితా ప్రకటన తర్వాత టికెట్‌ దక్కని ఆశావహులు తీవ్రఅసంతృప్తికి గురయ్యారు. నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం ఖరారైన వారికిసహకరించకుండా సహాయనిరాకరణ చేస్తుండగా మరికొందరు పార్టీనే వీడారు. ఇంకొందరు నిరసనబాట పట్టారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు జానారెడ్డి కమిటీతో పాటు పార్టీనేతలు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, కోదండరెడ్డి, మరికొందరు ముఖ్యనేతలు బుజ్జగింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు దిగిరాగా మరికొందరు వినేందుకు సిద్ధంగా లేకపోవటం, ముగ్గురి వరకు అసంతృప్తులు ఉన్నచోట సర్దిచెప్పటం తలకుమించిన భారంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే ఆయా నియోజకవర్గాల్లో మార్పులుచేయాలని పార్టీనాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే ఖరారైన అభ్యర్ధులపై సైతం సర్వేలు నిర్వహించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


రెండో జాబితా ప్రకటన అనంతరం, తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల సామర్థాల అంచనాకు జరిపిన సర్వేల్లో 9మందిపై ఆశించినస్థాయిలో సానుకూలతలేదని గుర్తించినట్లు తెలుస్తోంది. అసంతృప్తులకు నచ్చజెప్పిన తర్వాత ఆ సంఖ్య తగ్గుతూ వచ్చినట్లు సమాచారం. మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్‌ ప్రకటనతో ఇక్కడ టికెట్‌ ఆశించిన చలమల కృష్ణారెడ్డి భాజపాలో చేరారు. ఎల్బీనగర్‌లో ముగ్గురు నాయకులను బుజ్జగించి. ప్రచారకమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీతో కలిసి పనిచేసేట్లుగా చేయడంలో పార్టీ నాయకత్వం సఫలమైంది. కాంగ్రెస్‌ మూడోజాబితా ఇప్పటికే కొలిక్కివచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాలతో పొత్తులు, సీట్లు సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మిగిలిన 15 సీట్లలోనూ పార్టీ అభ్యర్థుల విషయంలో కొన్నిచోట్ల పోటీ కారణంగా జాబితా ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. రెండో జాబితాలో కొందరిని మార్చటంతో పాటు రెండు, మూడు మినహా మిగతా స్థానాలన్నింటికి ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

AP: అంగన్‌వాడీ పాలల్లో పురుగులు

ఆంధ్రప్రదేశ్‌లో బాలింతలకు ఇచ్చే పాలల్లో పురుగులు రావడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కచెల్లెమ్మలని ప్రేమ ఒలకబోసే నేతలు.. పౌషకాహారం ఇంత అధ్వానంగా ఉంటే ఏం పర్యవేక్షిస్తున్నారని మహిళలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పోలినాయుడుకండ్రిగలోని అంగన్‌వాడీ కేంద్ర నిర్వాహకులు గర్భిణులు, బాలింతలకు ఇటీవల పంపిణీ చేసిన పాలు గడ్డకట్టుకుపోయి.. పురుగులు పట్టాయి. జనవరి 14 వరకూ వాడుకోవచ్చని ఆ టెట్రా ప్యాకెట్లపై ఉంది. దీంతో శనివారం ఓ లబ్ధిదారు ప్యాకెట్లు తెరవగా అందులోని పాలు పూర్తిగా గడ్డకట్టి ఉన్నాయి. వాటిలో తెల్ల పురుగులు కనిపించాయి. దీనిపై అంగన్‌వాడీ సిబ్బందిని ప్రశ్నిస్తే తమకు వచ్చిన వాటిని పంపిణీ చేశామని.. అంతకు మించి ఏమీ తెలియదని చేతులెత్తేశారు.


Bus Accident : రైల్వే ట్రాక్‌పై నుంచి పడిన బస్సు…

రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో 24 మంది గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్‌పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో పలువురు గాయపడ్డారు. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినపుడు ఈ బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. బస్సు ప్రమాద స్థలాన్ని దౌసా అదనపు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ కస్వా పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

CBN: బాబుకు మద్దతుగా సింగపూర్‌లోనూ ఆందోళనలు

చంద్రబాబుకు మద్దతుగా సింగపూర్ లోని తెలుగుదేశం ఫోరం సభ్యులు పాదయాత్ర చేపట్టారు. ఆయన అవినీతి కేసు నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో ఉండాలంటూ... సీన్గాకాంగ్ వెల్మురుగన్ దేవాలయం నుంచి లిటిల్ ఇండియాలోని తిరుమల్ శ్రీనివాసం దేవాలయం వరకు 13కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.... 3వందల మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఫోరం సభ్యులంతా పాల్గొని చంద్రబాబుకు అంతా మంచి జరగాలని వెంకటేశ్వర స్వామివారిని కోరుకున్నారు.

Guinea: జైలు నుంచి తప్పించుకున్న గినియా మాజీ నియంత

 గినియా మాజీ నియంత మౌస్సా డాడిస్ కమరా జైలు నుంచి తప్పించుకున్నారు. ఆయుధాలు ధరించిన కొందరు వ్యక్తులు శనివారం తెల్లవారుజామున దేశ రాజధాని కొనాక్రిలోని జైలుపై దాడి చేసి మౌస్సాను విడిపించుకోపోయారని గినియా న్యాయ శాఖ మంత్రి చార్లెస్ అల్ఫోన్స్ పేర్కొన్నారు. మౌస్సాతో పాటు 2009లో ఓ స్టేడియంలో 157 మంది నరమేధానికి కారణమైన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దోషులు కూడా తప్పించుకున్నవారిలో ఉన్నారని తెలిపారు.

CBN: చంద్రబాబుకు మంగళవారం కంటికి ఆపరేషన్‌!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ మంగళవారం నిర్వహించే అవకాశం ఉంది. ముందస్తు పరీక్షల కోసం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే డాక్టర్లు సూచించారు. రెండు రోజుల పాటు ఏఐజీ ఆస్పత్రిలో టీడీపీ చీఫ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జూన్‌లో ఎడమ కంటికి చంద్రబాబు సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు కుడి కంటికి చేయించుకోవాల్సి ఉంది. వైద్య పరీక్షల కోసం చంద్రబాబు గురువారం ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఏఐజీకి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్‌ కె.రాజేష్‌ ఆధ్వర్యంలో జనరల్‌ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, డెర్మటాలజీ, పల్మనాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం చంద్రబాబుకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, అలర్జీ స్క్రీనింగ్‌, కాలేయ, మూత్రపిండాల పనితీరు, ఇతర టెస్టులు చేశారు. వాటి ఫలితాల ఆదారంగా వైద్యులు చికిత్స చేయనున్నారు.

MEET: చంద్రబాబుతో పవన్‌ భేటీ

ఆరోగ్యసమస్యలతో మధ్యంతర బెయిల్‌పై బయటకొచ్చిన చంద్రబాబును హైదరాబాద్‌లో ఆయన నివాసానికి వెళ్లిన పవన్‌, నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంపై వారు ఆరా తీశారు. ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టో ఇరువురు చర్చించినట్లు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. దాదాపు రెండున్నర గంటల సమావేశంలో షణ్ముఖ వ్యూహం పేరిట జనసేన తరపున ఆరు అంశాలను పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా ఉద్యోగాల కల్పన దిశగా ప్రణాళిక రూపకల్పనకు సూచించినట్లు తెలిసింది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.


బీపీఎల్ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా లేక ఇళ్ల మరమ్మతులు చేసుకోవాలన్నా ఉచితంగా ఇసుక పంపిణీ చేయటం సహా 30లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూతనిచ్చే ప్రత్యేక కార్యాచరణపై చర్చించిన్నట్లు సమాచారం. సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా 10లక్షల చొప్పున సాయం అందించాలని తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరిగేలా చూడాలని పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వ్యవసాయం - బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు 5వేల కోట్ల రూపాయలతో.. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయటంతోపాటు ఆ పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు

సమాచారం. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహించి వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడలని ప్రతిపాదించారు.మన ఏపీ మన ఉద్యోగాలు పేరిట.. ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ చేయటం ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలను పవన్ ప్రతిపాదించారు. సీపీఎస్ రద్దు చేసి పాత ఫించన్ విధానం అమలు హామీని మేనిఫెస్టోలో చేర్చాలని సూచించినట్లు తెలుస్తోంది. పవన్ చేసిన ప్రతిపాదనలకు సానుకులంగా స్పందించిన చంద్రబాబు..త్వరలోనే మరోసారి సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని నిర్ణయించిన్నట్లు సమాచారం. దాదాపు 2గంటల పాటు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అక్టోబరు 31న రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు వైద్య పరీక్షల కోసం ఇటీవల హైదరాబాద్‌ వచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. రెండ్రోజుల్లో చంద్రబాబు ఎల్వీపీఈఐలో నేత్ర పరీక్షలతో పాటు సర్జరీ చేయించుకుంటారని సమాచారం.

భద్రత కల్పించాలని రేవంత్‌రెడ్డి లేఖ

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తగిన భద్రత ఇవ్వాలని పేర్కొంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీకుమార్ , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఈ నెల ఒకటిన రాసిన ఈ లేఖ ప్రతి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇద్దరు సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, ఆరుగురు సబ్ ఇన్ స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ మొత్తం 69 మంది భద్రతను హైకోర్టు ఆదేశాల మేరకు తనకు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. గతంలో పాదయాత్ర సమయంలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందున..జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని వివరించారు. అధికార పార్టీ సానుభూతిపరులు హాని తలపెట్టి, తన ప్రచారానికి ఆటంకం కలిగించే అవకాశం ఉందనిలేఖలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి కనీసం ఆరుగురు+ఆరుగురు లెక్కన అయినా..భద్రత కల్పించాలని కోరారు. రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పాటు అందించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. తగిన భద్రత కల్పించకపోతే..కోర్టు ధిక్కరణ కింద తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.

YCP: మందేసి.. చిందేసిన మహిళలు

మాచర్లలో వైసీపీ సామాజిక సాధికారయాత్రలో మహిళలు మందేసి చిందేశారు. ఓ పక్క సామాజిక సాధికార యాత్ర సభ జరుగుతుంటే చివరలో కొందరు మహిళలు మందు సీసాలతో డ్యాన్స్‌ చేశారు. మద్యం సీసాలు చేతిలో పట్టుకుని తాగుతూ డ్యాన్స్‌ చేస్తూ హల్‌చల్ చేశారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీలు నందిగం సురేష్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాల్గొన్న సభలో ఇలా చేయడం విశేషం. ఈ సభ కోసం ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించి, బస్సులను కార్యకర్తలు, ప్రజలను తరలించారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పంచాయతీ నిధులు స్వాహా చేస్తున్న జగన్‌ సర్కార్‌

గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం సొంతానికి వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంటే కేంద్ర పెద్దలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఏపీ సర్పంచుల సంఘం, ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సర్పంచుల సదస్సు నిర్వహించారు. తాము ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడితే కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిందని తేల్చిందన్నారు. అయినా నేటికీ వైసీపీ ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు సైతం సీఎం జగన్ తీరును వ్యతిరేకిస్తున్నారని అన్నారు. 

YSRTP ఎన్నికల పోటీ కి దూరంగా ఉంటాం - వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీని ఓడించడం మా ఉద్దేశ్యం కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వి వద్దు అని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.

మేము పోటీ చేస్తే కేసిఆర్ కి లాభం జరుగుతుందని మేదావులు చెప్పారు అందుకే తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం ఇది , కాంగ్రెస్ పార్టీ కి YSRTP మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.

BUGGANA: ఏపీకి ఆర్థికంగా కష్టకాలమే

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి స్పష్టం చేశారు. ఏపీకి ఆర్థికంగా కష్టకాలమే అని... అందుకే జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు ఆలస్యమవుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా ఎంతో ప్రగతి సాధించామని కూడా బుగ్గన వెల్లడించారు. అప్పుల విషయంలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ నాటి టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కన్నా తాము తక్కువ అప్పులే చేశామన్నారు. మూలధన వ్యయం ఎంతో పెంచామని గణాంకాలు వెల్లడించారు. ఆర్థికంగా అన్ని విషయాల్లో ఎంతో సాధించామని ప్రకటించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుందని చెబుతున్నారు. మరి ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా యనమల వ్యాఖ్యలపైనే తాను స్పందించినట్లు తెలిపారు. అలా చెప్పానంటే ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పినట్లు కాదు. ఏపీలో కష్టకాలమే ఉందని అందుకే జీతాలు, పెన్షన్లు ఆలస్యమవుతాయని ముందు నుంచి చెబుతూనే ఉన్నామన్నారు.

ROJA: తిరుమలలో అన్యమత గుర్తులతో రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌

తిరుమలలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ నిబంధనలు ఉల్లంఘించారు. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా వచ్చారు. ఆమెతో పాటు తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్‌ స్టెయిన్‌ అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్లమండపం ఎక్కారు. రోజా ఫొటోగ్రాఫర్‌ తీరుపై అక్కడి భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి వారిని అదుపులో ఉంచాల్సిన మంత్రి.. ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీవారి ఆలయం వద్ద ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. తిరుమల కొండపై అన్యమత గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఫొటోగ్రాఫర్‌ ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

YCP: ఈ వైసీపీ కార్పొరేటర్ భర్త.. ఓ జేబు దొంగ

ఆయన వైసీపీ కార్పొరేటర్‌ భర్త. అందరిలా భార్య రాజకీయం జోలికి ఆయన వెళ్లడు. ఎక్కడ బహిరంగ సభలు ర్యాలీలు, ఉత్సవాలు ఉంటే అక్కడికెళ్లి జనాల జేబులు కొట్టేస్తాడు. క్షణాల్లో డబ్బును చేతులు మార్చేస్తాడు. తాజాగా చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు గుమిగూడిన జనం వద్ద చేతివాటం ప్రదర్శించి దొరికిపోయాడు. విజయవాడ 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్‌ గోదావరి గంగ భర్త గోదావరిబాబు. బుధవారం తెల్లవారుజామున చంద్రబాబును చూసేందుకు వచ్చిన జనాల్లో కలిసిపోయారు. వైసీపీ కార్పొరేటర్‌ భర్తై ఉండి చంద్రబాబును చూడడానికి వెళ్లారు. చంద్రబాబును చూసేందుకు తెలుగుదేశం శ్రేణులంతా గుమిగూడి ఉండగా గోదావరి బాబు ఓ నేత జేబులోని 20 వేలు కాజేశారు. ఆ డబ్బును తన వెంట తెచ్చుకున్న మరో మనిషికి ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. ఈ విషయాన్ని తెలుగుదేశం కార్యకర్తలు గుర్తించేసరికి పారిపోయే ప్రయత్నం చేశాడు. జనం అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు.


బందోబస్తు విధుల్లో ఉన్న కృష్ణలంక సీఐ దుర్గారావు అక్కడకు చేరుకుని గోదావరి బాబును అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడిని కృష్ణలంక స్టేషన్‌కు తరలించారు. నగదు తనవద్ద లభించకపోవడం, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు వైసీపీ నాయకుడిని బైండోవర్‌ చేసి వదిలేశారు. ఇటీవల నెల్లూరులోని ఓ మంత్రి చరవాణిని తస్కరిస్తూ పట్టుబడడంతో అక్కడి పోలీసులు గోదావరి బాబుపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అప్పటి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్రలోనూ తన హస్తలాఘవాన్ని ప్రదర్శించి దొరికిపోయినట్లు సమాచారం. గోదావరి బాబు 12 ఏళ్ల క్రితమే విజయవాడ వచ్చాడు. తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై గతంలో కేడీ షీట్‌ ఉంది. అది ప్రస్తుం గోదావరిబాబు నివసిస్తున్న కొత్త పేట పీఎస్‌కు బదిలీ కాలేదు. రెండు చోట్లా నిఘా లేకపోవడంతో గోదావరిబాబు హస్త లాఘవానికిఅడ్డులేకుండా పోయింది.

Chandrababu: బాబుకు బిగ్ రిలీఫ్..

 స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. నాలుగు వారాల పాటు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు పిటీషన్ వేశారు. దీని పైన వాదనలు పూర్తయిన తరువాత కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. దీంతో, 52 రోజుల రిమాండ్ తరువాత చంద్రబాబు కు బెయిల్ లభించింది. పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరుచేస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు. నాలుగు వారాలు అంటే.. నవంబర్ 24 వరకూ మధ్యంతర బెయిల్ ను చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఈరోజు సాయంత్రం 5గంటల నుంచి 7గంటల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి నుంచి నేరుగా అమరావతికి చంద్రబాబు చేరుకుంటారని సమాచారం.

Vande Bharat: వందే భారత్ ఢీకొని ముగ్గురు మృతి

భారత్‌లో రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉండగా,  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వందే భారత్ రైలు ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కసంపూర్ దగ్గర వందే భారత్ రైలు రానుండడంతో క్రాసింగ్ గేట్లను మూసివేశారు. అయినా కూడా రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు 40 ఏళ్ళ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు. కానీ వారు పట్టాలు దాటుతుండగా అత్యంత వేగంగా వచ్చిన వందే భారత్ ట్రైన్ వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటనలో మృతి చెందినవారు మీరట్ కు చెందిన మోనా, మనీషా, చారులుగా గుర్తించారు. మోనాకు 40 ఏళ్ళు కాగా, మనీషాకు 14, చారుకు 7 ఏళ్ళు. 

Knife In  Stomach : యువకుడి కడుపులో కత్తి.. ఐదేళ్లుగా నరకం

వైద్యు నిర్లక్ష్యం రోగుల ప్రాణాలు మీదికి తెచ్చిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. కత్తి పోట్లకు గురైన ఓ యువకుడు.. ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యుడు గాయాలను పరీక్షించకుండా ఏవో మాత్రలు ఇచ్చి పంపేశాడు. అతడి పొట్టలో కత్తి ఉన్న విషయం కూడా వారు  గుర్తించలేదు. అప్పటి నుంచి యువకుడ్ని కడుపునొప్పి వేధించడంతో పలు ఆస్పత్రులు చుట్టూ తిరిగాడు.  ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా కడుపులో కత్తి ఉన్నట్టు గుర్తించారు.  ఈ ఘటన గుజరాత్‌లో భరూచ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. అంకలేశ్వర్‌కు చెందిన అతుల్‌ గిరీ అనే యువకుడు ఐదేళ్ల కిందట కత్తిపోట్లకు గురయ్యాడు. స్థానిక సివిల్‌ ఆసుపత్రి వైద్యుడు.. బాధితుడిని సరిగ్గా పరీక్షించకుండానే ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంటికి పంపేశాడు. అప్పటి నుంచి అతుల్‌కు కడుపునొప్పి ప్రారంభమైంది. తీవ్రకావడంతో పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. కానీ, అతడికి ఉపశమనం లభించలేదు. ఐదేళ్ల పాటు నరకయాతన అనుభవించాడు. ఇటీవల అతుల్ ప్రమాదానికి గురికావడంతో అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  దీంతో వైద్యులు అతనికి ఎక్స్‌రే తీయగా, అతని కడుపులో కత్తి ఉన్నట్టు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా ఆ కత్తిని బయటకు తీశారు. దీంతో అతుల్ ఊపిరిపీల్చుకున్నాడు.

BANDLA: భావోద్వేగంతో ఏడ్చేసిన బండ్ల గణేష్‌

తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన సంఘీభావ సభలో సినీ నిర్మాత బండ్ల గణేష్‌ భావోద్వేగ ప్రసంగం చేశారు. నగర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు వేలాదిగా తరలివచ్చిన ‘సీబీఎన్‌ గ్రాటిట్యూడ్‌ కాన్సర్ట్‌లో బండ్ల గణేష్‌ కంటతడి పెట్టుకున్నారు. బాబుకు సంఘీభావంగా గళమెత్తిన బండ్ల... నాలుగు వేల ఏళ్లైనా చంద్రబాబు గొప్పతనం గుర్తుంటుందన్నారు. చంద్రబాబు పేరు మాత్రమే కాదని.. ఓ బ్రాండ్‌ అని కొనియాడారు. ఏపీ అభివృద్ధి కోసం కఠోరంగా శ్రమించడమే చంద్రబాబు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. ఆయన్ను జైల్లో పెట్టడం బాధగా ఉందంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.


Bihar: కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇంట్లో 24 ఏండ్ల యువకుడి మృతదేహం..

కాంగ్రెస్ కు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బిహార్లో  సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్‌ కు చెందిన ఇల్లు అది. ఎమ్మెల్యే మేనల్లుడు గోలు సింగ్ సైతం పట్నా లోనే నివసిస్తున్నాడు. అయితే అక్కడే  మృతుడు పీయూశ్‌ సింగ్‌  కొంతకాలంగా ఉంటున్నాడు.  శనివారం రాత్రి 7 గంటలకు గోలు సింగ్ ఇంటికి వెళ్లిన పియూష్ తిరిగి రాలేదు. ఇవాళ గోలు సింగ్ ఇంట్లో పీయూష్ మృతదేహాన్నిపోలీసులు కనుక్కున్నారు. పీయూష్‌ని ఎమ్మెల్యే మేనల్లుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం స్వాధీనం చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరూ లేరని వారు వెల్లడించారు. కేసు దర్యాప్తు నిమిత్తం ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గోలు సింగ్‌ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నామని.. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని పోలీసులు చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నారని వివరించారు. పోస్ట్ మార్టం నివేదిక తరువాత మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.


PROTEST: గోరంట్ల వ్యాఖ్యలపై భగ్గుమన్న టీడీపీ

చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో ఆయనకు మద్దతుగా కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీలు చేశారు. చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు అండగా రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు 50వ రోజు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కృష్ణయపాలెం, తుళ్లూరు, వెంకటపాలెంలో మహిళలు కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ చేశారు.


CBN అక్షరాలతో ప్రమిదలు వెలిగించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. నిరాధారమైన కేసులు పెట్టి అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేయించారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే... గోరంట్ల మాధవ్‌కి ఇప్పటి వరకు పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్నారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కల్యాణదుర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

TDP: జగనాసురుడి కళ్లు తెరిపిద్దాం

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఇప్పటికే మోత మోగిద్దాం, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో అరాచక, చీకటి పాలన సాగిస్తున్న జగనాసురుడికి 'కళ్లు తెరిపిద్దాం' అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇవాళ రేపు రాత్రి 7 నుంచి 7 గంటల ఐదు నిమిషాల మధ్య ప్రజలు కళ్లకు గంతలు కట్టుకుని బాల్కనీలు, వాకిళ్లు, వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా 'నిజం గెలవాలి' అంటూ నినాదాలుచేయాలని సూచించారు. ఈ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని లోకేశ్ కోరారు. 

Narra bhuvaneshwari: భువనమ్మ నిజం గెలవాలి యాత్ర

నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర మూడోరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగింది. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. మొదట రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత.... ఏర్పేడు మండలం మునగాలపాలెం వెళ్తుండగా వికృతమాల గ్రామ సమీపంలో TCL కంపెనీ ప్రతినిధులు భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోTCL ఏర్పాటైందని భువనేశ్వరికి వివరించియాత్రకు సంఘీభావం తెలిపారు. తర్వాత మునగాలపాలెం వద్ద ఇసుక అక్రమ నియంత్రణ పోరాటంలో అసువులు బాసినవారికి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వసంతమ్మ కుటుంబాన్నిశ్రీకాళహస్తి గ్రామీణ మండలం. పోలిలోని మునిరాజా కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని కుటుంబాలకూ3లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. తర్వాత శ్రీకాళహస్తి సభలో పాల్గొన్న భువనేశ్వరి...వైకాపా పాలనలో ఏపీ..... రాజధాని కూడా లేని అనాథగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

SUPPORTERS: సినీ పరిశ్రమ చంద్రబాబు గారితో మనం

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ నటుడు మురళీ మోహన్ విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుతో అందరి గుండెల్లో బాధ ఉందని, ఇదే తమిళనాడు, కర్ణాటకలో జరిగితే ప్రజలు భగ్గుమనేవారని అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో మరళీమోహన్ అధ్యక్షతన "చంద్రబాబుగారితో మనం" పేరుతో జరిగిన కార్యక్రమంలో పలువురు దర్శకులు , సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతు ప్రకటించిన వారు తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ఎప్పుడూ మరవలేమని తెలిపారు. ఈ నెల 29న గచ్చిబౌలి మైదానంలో ఐటీ ఉద్యోగులు నిర్వహించే కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.