- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

బాలీవుడ్స్టార్ హీరో అక్షయ్కుమార్కు కేంద్రం భారత పౌరసత్వాన్ని అందించింది. స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 'మనసు, పౌరసత్వం రెండూ హిందుస్థాన్వే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!' అంటూ ఓ పోస్ట్పెట్టారు. దీన్ని చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్లోకత్తులతో యువకుల వీరంగం చేశారు. జిల్లా కేంద్రంలోని వన్టౌన్లో నడిరోడ్డుపై హల్చల్ చేశారు.మద్యం మత్తులో స్థానికులపై కత్తులతో దాడి దిగారు. యువకుల దాడిలో పలువురికి గాయాలు కాగా.. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కత్తులతో దాడి చేసిన యువకులను పట్టుకొని పొలీసులకు అప్పగించారు స్థానికులు. అయితే నడిరోడ్డుపై దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదంటూ..ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు.

సైబరాబాద్ కమిషనరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిబ్బంది వందన స్వీకారం స్వీకరించి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఎందరో త్యాగధనులు చేసిన ప్రాణ త్యాగంతోనే మనం స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవిస్తున్నామని తెలిపారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి కమిషనర్ ప్రతిభ పురస్కారాలు అందించారు.

అనకాపల్లి జిల్లా చోడవరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల తీవ్ర అవస్థలకు గురయ్యారు. కొంతమంది స్థానిక నాయకుల మెప్పు పొందేందుకు చోడవరం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు మండుటెండలో అవస్థలకు గురి చేశారు. మధ్యాహ్నం 12గంటల వరకు వేడుకలను ప్రారంభించలేదు. అత్యుత్సాహంతో విద్యార్ధులను మండుటెండలో నిలబెట్టారు. ఎండతాపం తట్టుకోలేక అవస్ధలు పడ్డారు. అంతకు ముందు జూనియర్ కాలేజీ వద్ద నుంచి స్ధానిక శివాలయం వరకు 600 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.

తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో రాష్ట్రం సాధించింది ఏమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి 5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. మధిరలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను చెపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వల్లే రాష్ట్రంలో ఇళ్లు, పెన్షన్లు, దళిత బంధు ఇస్తున్నారని తెలిపారు. రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలను ఎత్తివేయడం జరిగిందని భట్టి విమర్శించారు.

అనేకసార్లు గద్దర్తో కలిసి పనిచేశానని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. కొందరు కావాలనే లేనిపోని అపోహలు సృష్టించారని అన్నారు.. గద్దర్ ప్రజలకోసం పోరాడని.. తాను కూడా ప్రజల కోసమే పోరాటం చేశామని అన్నారు.తన గురించి గద్దర్కు తెలుసని.. అలాగే గద్దర్ గురించి తనకు బాగా తెలుసని,తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని అన్నారు.గద్దర్ స్ఫూర్తిని భావితరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గద్దర్ ఆశయాలను కొనసాగించేలా తమ కార్యాచరణ ఉంటుందని అన్నారు చంద్రబాబు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసగించిన కిషన్ రెడ్డి... రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ తల్లి కేసీఆర్ చేతిలో బందీ అయిందన్నారు. తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ డైనింగ్ టేబుల్పై నిర్ణయిస్తున్నారంటూ విమర్శించారు.

దేశంలో నెలకొన్న అవినీతి, యువతలో పెరుగుతున్న అలసత్వం, మాదక ద్రవ్యాల వినియోగంపై పోరాడాలని సినీనటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు. ఎందరో మహానుభావులు, విప్లవకారులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వేచ్చావాయువులు లభించాయని బాలకృష్ణ తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో అధికార పార్టీ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తనను అవమానించారంటూ జడ్పీటీసీ పద్మ జాతీయ జెండా స్థంభం వద్ద కింద కూర్చొని నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అధికార పార్టీ జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ రూపలను ఆహ్వానించారు. ప్రోటోకాల్ ప్రకారం జడ్పీటీసీ పద్మ జెండా ఎగురవేయాలి. ఎంపీపీ చంద్రశేఖర్ జెండా ఆవిష్కరించారు. ఎంపీపీతో ఎలా ఆవిష్కరిస్తారంటూ జెండా దిమ్మె వద్ద నిరసన వ్యక్తం చేశారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యం అని తెలిపారు. మనం ఎంత మేర అభివృద్ధి చెందామో పాలకలు, మేధావులు ఆలోచన చేయాలన్నారు. రుషికొండను గుండు కొట్టిన ఘటనలో ప్రభుత్వ పెద్దలు సమర్దించుకోవడం సిగ్గుచేటు అన్నారు. హూదూద్ తుఫానులో విశాఖను కాపాడింది రుషికొండ అన్న విషయాన్ని మర్చిపోవద్దని అయ్యన్న తెలిపారు.

సిద్ధిపేటలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో స్వాతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రి హరీష్ రావు... మువెన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు హరీష్. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ప్రసగించిన హరీష్..... సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు ...తెలంగాణ వ్యవసాయాన్ని చిన్న చూపు చూశారన్నారు. రైతు బాధలను అవహేళను చేశారన్న ఆయన... వ్యవసాయం దండగ అంటూ చిత్రీకరించారన్నారు. ఆంధ్ర పాలకుల హయంలో తెలంగాణ పల్లెలు కన్నీళ్లు పెట్టాయన్న హరీష్... ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఇవే పల్లెలు కళకళలాడుతున్నాయన్నారు.

ఇటీవల కన్నుమూసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అల్వాల్లోని భూదేవి నగర్లో ఉన్న గద్దర్ నివాసానికి వెళ్లిన ఆయన.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రజా ఉద్యమాలకు పాటతో ఊపిరి పోసిన గద్దర్ మృతితో..ప్రశ్నించే స్వరం మూగబోయిందని చంద్రబాబు ఇటీవలే ట్వీట్ చేశారు. పౌర హక్కుల ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరువ లేనిదని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు పాదయాత్ర చేస్తారు. విజన్ - 2047 డాక్యుమెంట్ను ఉడా పార్క్లోని ఎంజీఎం మైదానంలో ఆవిష్కరించనున్నారు. ఇండియా, ఇండియన్, తెలుగు- విజన్ 2047 అని ఈ డాక్యుమెంట్కు నామకరణం చేశారు. భారతదేశం గ్లోబల్ లీడర్గా ఎదిగేందుకు అనుసరించాల్సిన ఐదు వ్యూహాలతో గ్లోబల్ ఫోరం సస్టెయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ సంస్థ.. ఈ డాక్యుమెంట్ను రూపొందించింది. దీనిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు చంద్రబాబు.

దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాలకుఅంతా సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సైఫాబాద్లోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకల్లో సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. దేశ విభజన తర్వాత జరిగిన హింసాకాండపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు జోనల్ మేనేజర్ శ్యాంసుందర్.. వారి త్యాగాలను భారతీయులంతా స్మరించుకోవాలని చెప్పారు..

ప్రజా వేదిక కూల్చివేసిన సీఎం జగన్ స్ఫూర్తితో గుంటూరు జిల్లా పొన్నూరులో రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసానికి పాల్పడ్డారని టీడీపీ నేత ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.. పొన్నూరులో రోడ్డు విస్తరణ బాధితులను ధూళిపాళ్ల నరేంద్ర పరామర్శించారు. అధికారులు మానవత్వం లేకుండా ఇష్టానుసారం ఇళ్లను కూల్చివేశారని ధూళిపాళ్ల మండిపడ్డారు. రోడ్డు విస్తరణను వైసీపీ కార్యక్రమంలా మార్చివేశారని ఆరోపించారు. రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసానికి పాల్పడిన వారందరినీ టీడీపీ అధికారంలోకి వచ్చాక జైలుకు పంపుతామని ధూళిపాళ్ల హెచ్చరించారు.

తిరుపతిలో వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ సమావేశం జరిగింది. అడిషనల్ PCCFO శాంతిప్రియ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జంతుల సమాచారం కోసం కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. నడకదారికి 100మీటర్ల దూరంలో కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశామని..15ఏళ్లలోపు పిల్లలతో వెళ్లే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నారి లక్షితను చంపి తిన్న చిరుత.. ఇవాళ పట్టుబడిన చిరుత ఒక్కటేనా కాదా అన్నది తేలాల్సి ఉందని అన్నారు. ఒక వేళ పట్టుబడిన చిరుతే పాపను చంపి ఉంటే జూలోనే ఉంచుతామని తెలిపారు శాంతి ప్రియ.

తిరుమల కాలినడక మెట్ల మార్గంలోని పరిసరాల్లో మరో ఐదు చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని వెల్లడించారు. ట్రాప్ కెమెరాల్లో చిరుతల దృశ్యాలు నమోదయ్యాయని తెలిపారు. ఇవాళ ఉదయం తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఓ చిరుత చిక్కింది. ఈక్రమంలో చిరుత స్వల్పంగా గాయపడటంతో.. ఎస్వీ జూ పార్కులో చికిత్స అందిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. శిమ్లా లోని ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడి 15 మంది మృతిచెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీయగా.. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నారు. శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే శివాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. ప్రమాద సమయంలో ఆలయంలో 50 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్ . ప్రగతి భవన్ జరిగిన కార్యక్రమంలో బీజేపీ వంద అబద్దాలు పేరుతో బుక్లెట్, సీడీ విడుదల చేశారు.ప్రధాని మోదీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు.9 ఏళ్లలో మోదీ సర్కార్ వంద లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు.2023లో జీడీపీలో కేంద్ర ప్రభుత్వం అప్పు 58 శాతమన్న కేటీఆర్..కేంద్రం కంటే తెలంగాణ ఎంతో ఉత్తమంగా ఆర్ధిక సమతూల్యం పాటిస్తుందని అన్నారు.

నెల్లూరులో టీడీపీపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. చేజర్ల మండలం పాతపాడులో టీడీపీ వార్డు మెంబర్ అభ్యర్థి బైక్ తగలబెట్టారు. నిన్న టీడీపీ తరపున నామినేషన్ వేసిన బాబాసాహెబ్పై దాడి చేశారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని టీడీపీ అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ఒప్పుకోకపోవడంతో భౌతిక దాడులకు దిగారు. ఇటీవల ఐదో వార్డు మెంబర్ మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు అధికారులు. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేత ఆరోపించారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. సమస్యలపై ధర్నా చేస్తామంటే అరెస్ట్ ఏంటని నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. విడతల వారిగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు తరలిస్తున్నారు.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామం దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సడెన్ బ్రేక్ వేయడంతో కారును వెనక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. లారీ ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టింది. కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్షతగాత్రులను ఆస్పత్రి తరలించిన పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాదానికి గురైంది నల్గొండ జిల్లా గుండ్లపల్లి వాసులుగా గుర్తించారు.

తిరుమల అడవిలో..చిక్కిన ఆడ చిరుతను జూకు తరలించారు. 3 నెలల పాటు చిరుతను జూ క్యారంటైన్లో ఉంచుతామన్నారు సీసీఎఫ్ నాగేశ్వరరావు. చిరుత రక్త నమూనాలు సేకరించి బాలిక రక్తం శాంపుల్స్ తో మ్యాచ్ చేస్తామన్నారు. చిరుత సెలైవా పరీక్షలు కూడా చేస్తామన్నారు. భక్తుల్లో భయాందోళలను తగ్గించేందుకు క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపారు. మళ్లీ అడవుల్లో విడిచిపెడితే భక్తులపై దాడిచేసే ప్రమాదం ఉందని అందుకే.. జూకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. బాలికపై దాడి చేసింది ఈ చిరుతేనా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ పరీక్షలంటున్నారు సీసీఎఫ్ నాగేశ్వరరావు.

హైదరాబాద్ ప్రగతి నగర్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో రోడ్డుపై పలు వాహనాలను ఢీ కొట్టి తప్పించుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు, బాధితులు పట్టుకుని చితకబాదారు. పలు ద్విచక్ర వాహనాలను, రోడ్డుపై నిలిపి ఉంచిన కారును ఢీకొట్టింది. నిర్లక్ష్యంగా కారును నడుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన వాహనదారులు, కారును వెంబడించి కూకట్పల్లి ఎల్లమ్మ చెరువు వద్ద అడ్డుకున్నారు. ఇద్దరు యువకులను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకుని గాయపడ్డ యువకులను ఆస్పత్రికి తరలించారు.

నెల్లూరులో టీడీపీపై వైసీపీ దాడులు చేశారు.చేజర్ల మండలం పాతపాడులో టీడీపీ వార్డు మెంబర్ అభ్యర్థి బైక్ తగలబెట్టారు వైసీపీ కేడర్.నిన్న టీడీపీ తరపున నామినేషన్ వేసిన బాబాసాహెబ్పై దాడి చేశారు.నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని టీడీపీ అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ఒప్పుకోకపోవడంతో బౌతిక దాడులకు దిగారు. ఇటీవల ఐదో వార్డు మెంబర్ మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు అధికారులు.తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ ఆరోపించారు.

ప్రభుత్వం బకాయిలను సక్రమంగా చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ 20 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ మొదటి మహాసభ హనుమకొండలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈటల ముఖ్యఅతిథిగా హజరయ్యారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాటాలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యూలరైజ్ చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వంతో రైతులకు భరోసా దొరికిందని మంత్రి హరీష్ రావు అన్నారు. బావుల వద్ద మీటర్లు పెడతామని బీజేపీ, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ చెబుతుంటే... నీళ్లకు, కరెంట్కు డోకా లేదని, మూడు పంటలు పండించాలని సీఎం కేసీఆర్ రైతులకు చెబుతున్నారని మంత్రి అన్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చారని తెలిపారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. నందల పాడులో సురేంద్ర అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అదే కాలనీకి చెందిన యువకులు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలలో అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. అర్ధరాత్రి ఈ ఆపరేషన్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. రెండ్రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపింది. దీంతో బాలికపై దాడి చేసిన ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక రెండ్రోజులుగా ఆరు ప్రాంతాల్లో సంచరిస్తూ అటు అధికారుల్ని, భక్తులను చిరుత భయాందోళనకు గురిచేసింది.

సినీ నటుడు రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్రలతో బిజిబిజీగా ఉన్నారు. ఇటీవలే రిషికేష్లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్ని సందర్శించిన రజనీకాంత్... తాజాగా బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని రజనీకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అభిమానులకు అభివాదం చేసి, వారితో కాసేపు ముచ్చటించారు. రజనీకాంత్ బద్రీనాథ్ టూర్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.

బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, హామీల అమలు కోసం ఒత్తిడి పెంచేందుకు పోరాటాలు ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో మూడు కేంద్రాల నుంచి రథయాత్రలు చేపట్టనుంది. ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి యాత్రలు ప్రారంభించే అవకాశం ఉంది. ఒక్కో కేంద్రం నుంచి ప్రారంభమయ్యే రథ యాత్ర ప్రతీ రోజు కనీసం 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కొనసాగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

నేడు మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 53కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జీవధాన్ స్కూల్ ప్రాంగణంలో 35వేల మందితో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి రానుండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9కి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయల్దేరి ఉదయం 11 గంటలకు కామారెడ్డికి చేరుకుంటారు.

ఈనెల 18న జహీరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ జరగనుంది. ఈనేపథ్యంలో ఇవాళ గాంధీభవన్లో జిల్లా నేతలతో మాట్లాడి.. నియోజకవర్గంలోని, ఏ ప్రాంతంలో సభ పెట్టాలన్నది నిర్ణయించనున్నారు. ఖర్గే సభలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించనుంది. కాగా.. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏర్పాటైన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, స్ర్కీనింగ్ కమిటీలు గాంధీభవన్లో తొలి సారిగా భేటీ కానున్నాయి. ఈ భేటీలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సింగపూర్ తరహాలో మూసీ నదిపై బ్రిడ్జీలు నిర్మిస్తామన్నారు బీఆర్ఎస్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్... హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. కాచిగూడ డివిజన్లోని బర్కత్ పుర హౌసింగ్ బోర్డు కాలనీ పార్కును ప్రారంభించారు. 52 కోట్ల నిధులతో మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జీలను సింగాపూర్ తరహాలో నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమారమేష్ యాదవ్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

ఎంపీలు బఫూన్లంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా కమెడియన్పై ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే రఘునందన్రావు ...నటుడు ప్రకాష్రాజ్పై పరోక్షంగా రఘునందన్రావు విమర్శలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బీజేపీ ఆఫీసులో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో రఘునందన్రావు పాల్గొన్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సైనికులను సన్మానించారు. దళితుల భూములు లాక్కున్నట్లే .. జవాన్లకు ఇచ్చిన 3ఎకరాల భూములను కాజేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రఘునందన్రావు ఆరోపించారు. దేశంలో అతి తక్కువ సమయం పాటు అసెంబ్లీ నడిపిన సీఎంగా కేసీఆర్ రికార్డ్ సాధించారని విమర్శించారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర టీడీపీలో నూతన ఉత్తేజాన్ని నింపింది. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర మంగళవారం మంగళగిరి నియోజవర్గంలోకి ప్రవేశించనుంది. లోకేష్కు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. స్వాగత సన్నాహక కార్యక్రమంలో భాగంగా నియోజవర్గంలో టీడీపీ ర్యాలీ నిర్వహించింది.. యువగళం స్టిక్కర్లతో ఉన్న కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లి, ఉండవల్లి, మంగళగిరిలో ఈ ర్యాలీ కొనసాగింది. ఇప్పటికే నియోజవర్గంలో లోకేష్ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


