- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

దశాబ్ధాలుగా హైదరాబాద్ బోరబండ NRRపురం వాసులు ఎదురుచూసిన థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ సమస్యను తాము పరిస్కరించామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. హౌసింగ్ సొసైటీలో ఉన్న సుమారు 2వేల కుటుంబాలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ జీవో 96 ఇటీవల విడుదలైందని తెలిపారు. దీనివల్ల క్రయ విక్రయాలు జరుపుకొనే వారికి పూర్తి స్ధాయిలో ఎలాంటి ఫీజులు లేకుండా రిజిస్ట్రేషన్ అవుతుందని ఎమ్మెల్యే మాగంటి అన్నారు.

హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గం బీఆర్ఎస్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పై మాజీ కార్పోరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. అంబర్పేట్ టికెట్ కాలేరు వెంకటేష్కు కేటాయించొద్దని అంటున్నారు. నియోజకవర్గ ప్రజలను కలుపుకోలేని ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చండి.. అంబర్పేట్ను కాపాడండి సీఎం గారు అంటు నిరసన గళమెత్తారు. అంబర్పేట్ అభ్యర్ధిని మారిస్తే పార్టీ విజయం కోసం కృషి చేస్తామని మాజీ కార్పోరేటర్లు అంటున్నారు.

జమ్మూకశ్మీర్లోని లద్దాక్లో జరిగిన ఆర్మీ ట్రక్కు ప్రమాదంలో తెలంగాణకు చెందిన జవాన్ మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తంగళ్లపల్లి పంచాయతీ పరిధిలోని తిర్మన్దేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయారు. జవాన్ స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నీరటి చంద్రశేఖర్ 2010లో ఆర్మీ జవానుగా సైన్యంలో చేరారు. చంద్రశేఖర్కు భార్య, నాలుగేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురు ఉన్నారు.15 ఏళ్లకు గాను 13 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. మరో రెండేళ్ల తర్వాత సర్వీస్ పూర్తవుతుంది. అంతలోనే చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయారు.

టీడీపీ నాయకులు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. యువగళం 189వ రోజు పాదయాత్ర నిన్న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి నిడమనూరు వరకు సాగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ఇవాళ తెల్లవారుజాము వరకు సాగింది. సుమారు 12 గంటలు నిర్విరామంగా 16 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అర్ధరాత్రి దాటాక కూడా పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు వేచి ఉండటంతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగారు.

నీట్ పరీక్షలో మినహాయింపు ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. నీట్ వ్యతిరేక బిల్లుకు సంతకం చేసేదిలేదన్న గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపైనా స్టాలిన్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేశారు డీఎంకే నేతలు, కార్యకర్తలు. నీట్ రద్దు చేయాలంటూ మంత్రి ఉదయనిధి నేతృత్వంలో నిరాహార దీక్ష జరిగింది. నీట్ పరీక్షలో తమ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. నీట్ వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న ఆయన... దీనిపై ఢిల్లీలోనూ పోరాటం చేస్తామన్నారు.

నిర్మల్ జిల్లాలో నూతన మాస్టర్ ప్లాన్ తీవ్ర దుమారం రేపుతోంది. 220 జీవో రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను ఆర్ధరాత్రి భగ్నం చేశారు పోలీసులు. గత 5 రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. షుగర్,బీపీ లెవల్స్ పడిపోవడంతో అరెస్ట్ చేసి.. నిర్మల్ ఏరియా అస్పత్రికి తరలించారు. అయితే మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదన్న మహేశ్వర్రెడ్డి అస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏరియా అస్పత్రికి భారీగా చేరుకుంటున్న బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 189వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. లోకేష్కు మద్దతుగా యువగళానికి జనం భారీగా తరలివచ్చారు. దారి పొడవునా లోకేష్కు స్థానికులు, టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ కలిసిన వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. హైస్కూల్ రోడ్, ఆటోనగర్, కానూరు, తాడిగడప, పోరంకిల మీదుగా యాత్ర సాగనుంది. నిడమానూరు దగ్గర గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. రాత్రికి నిడమానూరులో లోకేష్ బస చేస్తారు. దాదాపు 15 కిలో మీటర్లపైనే అర్ధరాత్రి వరకు పాదయాత్ర సాగనుంది.

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు వైజాగ్ నుంచి పాడేరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ చెట్టుకొమ్మను తప్పించబోయి..స్టీరింగ్ను పక్కకు తిప్పడంతో లోయలోకి దూసుకెళ్లింది. అమ్మవారి పాదాలు, వ్యూపాయింట్ దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదవ రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన సీఐ పురుషోత్తంను సస్పెండ్ చేయాలంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసుల్ని ఇంట్లోకి రానీవ్వకుండా ఇంటి గేటు ఎదుట కార్యకర్తలు పెద్ద ఎత్తున బైటాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడి నుండి వెనుదిరిగారు.

హైదరాబాద్లో మరో బెగ్గింగ్ ముఠా గుట్టురట్టయింది. అనాథ గృహాల ఫౌండేషన్ పేరుతో...కూడళ్ల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్, మలక్పేట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో బెగ్గింగ్ ముఠా పట్టుబడింది. అమ్మ చేయూత ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గణేష్, రవి, మంగు... ఇద్దరు ఏజెంట్లను నియమించుకొని వసూళ్లకు తెరలేపారు. అంతేగాకుండా సంస్థ నిర్వాహకులు సమాజ సేవ కోసం ఏడుగురు యువతులను నియమించుకొని ఫౌండేషన్ పేరిట డబ్బు వసూళ్లు చేయించారు. కలెక్షన్ బాక్సులను తయారు చేయించి.. వాటిని అద్దెకు ఇచ్చినట్టు గుర్తించారు.

సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నూతన మెడికల్ కాలేజ్ భవనం, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. కాసేపట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత ప్రగతి నివేదన సభలో పాల్గొంటారు. కొత్త మార్కెట్ యార్డు వెనకాల 50 ఎకరాల స్ధలంలో దాదాపు లక్ష మందితో సూర్యాపేట ప్రగతి నివేదన సభ తలపెట్టారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

జగన్ పాలనలో రవాణారంగం కుదేలయ్యిందని విమర్శించారు నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో భాగంగా విజయవాడ ఆటోనగర్ కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు నారా లోకేష్.. ఎంతో చరిత్ర ఉన్న విజయవాడ ఆటోనగర్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేశారని ...కార్మికుల పోరాటంతోనే జగన్ వెనక్కి తగ్గారన్నారు. అధికారంలోకి వచ్చాక రవాణారంగానికి పునర్వైభవం తీసుకొస్తామని చెప్పారు. మరమ్మతుల పేరుతో జగన్ ప్రభుత్వం వ్యాట్ పెంచింది కానీ.. ఒక్క రోడ్డుకు కూడా మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని పనులను ప్రక్షాళన చేస్తామన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం మాతాశిశు కేంద్రంలో గర్భిణి మృతితో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టేకులపల్లి మండలం మొక్కంపాడు తండాకు చెందిన గర్భిణి..14 రోజుల క్రితం డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది. అర్ధరాత్రి బ్లీడింగ్ అధికమవడంతో చనిపోయిందని సిబ్బంది చెప్పారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ బిడ్డ పరిస్థితి బాగాలేదని ఎన్ని సార్లు చెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదని మృతదేహాన్ని కూడా చూపించకుండా మార్చురీకి తరలించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి మండలం నల్లగుట్ల పొలాల వద్ద ఈ విషాద ఘటన జరిగింది. ఏనుగు మృతిపై అటవీ అధికారులకు రైతులు సమాచారం అందించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి నివాసం దగ్గర టెన్షన్ కొనసాగుతోంది. జేసీ ఇంటి ముందు ప్రభుత్వ కాలేజీ ప్రహరీ గోడ నిర్మాణం వివాదాస్పదంగా మారింది.. పునాదుల కోసం తవ్విన గోతులను గుర్తుతెలియని వ్యక్తులు.. రాత్రికి రాత్రే పూడ్చేశారు. మరోవైపు జేసీ ఇంటికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు.. ఘటనాస్థలంలో 30 యాక్ట్ అమలులో ఉందని చెబుతున్నారు. టీడీపీ నేతలపై కక్షలో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు పనులు చేపట్టారని జేసీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ నెల 26న చేవెళ్లలో జరగనున్న బహిరంగ సభతో పాటు పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ విడుదల చేయనుంది. ఈ నెల 29న వరంగల్లో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేయాలని తెలంగాణ నేతలు భావిస్తున్నారు.ఆ తర్వాత మహిళా డిక్లరేషన్ కూడా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు టీ కాంగ్ నేతలు . ఇక మహిళా డిక్లరేషన్ విడుదలకు ప్రియాంక గాంధీని ఆహ్వానించనున్నారు.

విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆలయంలో భారీ చోరీ జరిగింది. నూకాలమ్మ ఆలయంలో పట్టపగలు దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారింది. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఉన్న వెండి కిరీటం, 40 తులాల బంగారంతోపాటు పంచపాత్ర ఇతర వస్తువులు చోరీ అయ్యాయి. ఆభరణాల్ని సంచిలో వేసుకొని దొంగ తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చోరికి సంబంధించి పెందుర్తి పీఎస్లో ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

అధికార బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్కు మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టికెట్ గొడవ జరుగుతుంటే.. ఇప్పుడు భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ విషయం కూడా రచ్చకెక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమకారులు పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇల్లందు బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్కు టికెట్ ఇవ్వొద్దని నిర్ణయించారు. హరిప్రియకు కాకుండా ఇతరులకు ఇవ్వాలని తీర్మానిస్తూ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ఇంట్లో ఈ భేటీ జరిగింది. 5మండలాలకు చెందిన అసమ్మతి నేతలు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్కు వ్యతిరేకంగా గళం వినిపించారు.

కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. తలకుగాయాలతో వచ్చిన యువకుడిపై లాఠీ ఝులిపించాడు. కనీసం కనికరం చూపకుండా దారుణంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ యువకుణ్ని లాఠీతో కొట్టిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరలయ్యాయి. సతీష్ ఇంట్లో గొడవ జరగడంతో అతనికి తలకు గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు 100కు డయల్ చేయడంతో....పోలీసులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ యువకుడితో గొడవపడ్డ కానిస్టేబుల్ సత్యనారాయణ లాఠీతో ప్రతాపం చూపారు.

ముషీరాబాద్ భోలక్పూర్లో భారీ పేలుడు సంభవించింది. అంజుమన్ స్కూల్ సమీపంలోని స్టీల్ స్క్రాప్ దుకాణంలో కెమికల్ బాక్స్ పేలింది. ఈ ఘటనలో గౌసిద్దిన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం పూర్తిగా కాలిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

మంత్రి కేటీఆర్కు కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలు... చూసేది బీఆర్ఎస్ నేతలు అంటూ కామెంట్ చేశారు. గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బాధ్యులపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. కనీసం సమావేశానికి ఉన్నతాధికారులను కూడా పంపడం లేదని ఆరోపించారు.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు.. సమావేశంలో హైదరాబాద్లోని పాఠశాలలో వసతుల కల్పనపై చర్చించారు.. కొన్ని పాఠశాలలకు విద్యుత్ సరఫరా నిలిపివేతపై కిషన్రెడ్డి సీరియస్ అయ్యారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగొద్దన్నారు. దిశా మిటింగ్కు హాజరుకాని అధికారులపై కేంద్రానికి లేఖ రాస్తానని కిషన్రెడ్డి హెచ్చరించారు.

జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనుచరులు ఆందోళన బాట పట్టారు. పల్లా వద్దు..ముత్తిరెడ్డే ముద్దు అంటు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.ముత్తిరెడ్డి అనుచరులు భారీగా జనగామకు చేరుకుంటున్నారు.బీఆర్ఎస్ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వద్దని..ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కి ఇవ్వాలని ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు.

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులకు, ఆలయ ఈవో కు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈవో శ్రీనివాసరెడ్డి తమను అవమానించారని అర్చకులు ఆరోపిస్తున్నారు. చైర్మన్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ ట్రస్టు బోర్డు సమావేశానికి వంశపారంపర్య అర్చకుడు పార్థసారధి ఆచార్యులు హాజరుకావాల్సి ఉంది. కానీ శ్రావణమాసం నేపథ్యంలో తన వారసుడు ఏడీ అంజన్ కుమార్ ఆచార్యులను సమావేశానికి పంపించారు. దీనిపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి నీవెందుకు వచ్చావని మండిపడ్డారు. అంజన్ కుమార్ సైతం తాను వంశపారంపర్య అర్చకుడునని వాదించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

ఏపీలో జరుగుతున్న స్ధానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది.శ్రీ సత్యసాయి జిల్లా చలివెందులలో వైసీపీ మద్దతుదారుడిని గెలిపించాలని డబ్బులు పంచారు వైసీపీ నేతలు. అయితే పోలీసుల సమక్షంలోనే యధేచ్చగా నగదు పంపిణీ చేస్తున్నా,గుంపులు, గుంపులుగా పోలీంగ్ కేంద్రాల్లో తిరుగతున్నా అధికార పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంలేదని మండిపడుతున్నారు స్థానికులు. పోలింగ్ బూత్ నుంచి ఓటు వేసి బయటకు రాగానే వేయి రూపాయల నగదు పంపిణీ చేశారు మండల వైస్ ఎంపీపీ రఘునాథ రెడ్డి. అయితే వైసీపీ నగదు పంపిణీని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.

నారా లోకేష్ పాదయాత్ర కృష్ణా తీరంలోకి ప్రవేశించబోతోంది. కాసేపట్లో చంద్రబాబు నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. ఉండవల్లి కరకట్టపై నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించనుంది. లోకేష్కు స్వాగతం పలికేందుకు కేశినేని చిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా లోకేష్ పాదయాత్ర సాగినప్పుడు బోట్స్ ద్వారా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. సుమారు 150 పడవలు యువగళం జెండాలు కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మగుంట గ్రామంలో సర్పంచ్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారం ఉందని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు.

వచ్చే ఎన్నికల తరువాత ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామన్నారు మంత్రి కేటీఆర్.హైదరాబాద్లో నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 2.6 కిలో మీటర్ల పొడవు ఉన్న ఈ ప్లైఓవర్కు 450 కోట్ల రూపాయల వ్యయం అయింది.అతి ఎత్తైన స్టీల్ బ్రిడ్జితో దశాబ్దాల ప్రజల కల నెరవేరిందని అన్నారు మంత్రి కేటీఆర్.తెలంగాణ ఏర్పడ్డాక ప్రారంభించిన 36వ ఫ్లైఓవర్ ఇదని అని,స్టీల్ బ్రిడ్జ్తో హైదరాబాద్కు కొత్త అందం వచ్చిందని అన్నారు.లోయర్,అప్పర్ ట్యాంక్బండ్ కలిపేలా అద్భుత నిర్మాణం జరిగిందని,కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు కేటీఆర్.

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. వరికుంటపాడు మండలం గణేశ్వరపురం గడపగడపకు కార్యక్రమంలో.. వైసీపీ నేతలు బహాబాహీకి దిగారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. కారు దిగిన మేకపాటి రెండు వర్గాల నాయకులను తీవ్రస్థాయిలో మందలించారు. ఇలా కొనసాగితే మీ మండలానికో దండం..ఇక మీ మండల కార్యక్రమాలకు రానంటూ రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

సీఎం కేసీఆర్ రేపు సూర్యాపేట పర్యటనకు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాలను మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం కొత్త మార్కెట్ యార్డు వెనకాల 50 ఎకరాల స్ధలంలో దాదాపు లక్ష మందితో సూర్యాపేట ప్రగతి నివేదన సభ నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు దిశానిర్ధేశం చేయనున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

తిరుమలలో చిరుతల సంచారం కొనసాగుతుంది.మొదటి ఘాట్లో ఎలిఫెంట్ ఆర్చ్ దగ్గర చిరుత కనిపించింది.ట్రాప్ కెమెరాలకు చిరుత దృశ్యాలు చిక్కాయి.అటు స్పెషల్ టైప్ కాటేజీల దగ్గర ఎలుగుబంటి సంచారం భక్తులను కలవరపెడుతుంది.ఎలుగుబంటిని బంధించేందుకు బోన్లు ఏర్పాట్లు చేశారకు టీటీడీ అధికారులు. మరోవైపు వన్య ప్రాణుల సంచారంతో తిరుమల కాలినడక బాటలో భక్తుల రద్దీ తగ్గింది. వారాంతపు సెలవులు ఉన్నా రోజు రోజుకు జనం తగ్గుతున్నారు.చిరుతల సంచారంలో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్న నేపధ్యంలో 7 వేల సర్వదర్శనం టోకన్లు మిగిలిపోయాయి.

ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళుతున్న ముగ్గురు యువకులను ఇసుక లారీ ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో జరిగింది. మృతులు కొనకనమిట్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు. మార్కాపురం మండలం రాజుపాలెం గ్రామంలో ఓ శుభకార్యానికి హజరై తిరిగి వెళతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక యువగళం ఏర్పాట్లను పర్యవేక్షించారు టీడీపీ నేత కేశినేని చిన్ని.విజయవాడలో నారా లోకేష్ యువగళం ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు కేశినేని చిన్ని.యువగళం పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు అధికారుల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని.. అయితే వైసీపీ సర్కార్ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు.రేపటి భవిష్యత్ కు లోకేష్ మాత్రమే భరోసా అని అన్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కు చుక్కలు చూపించారు జనం.ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి తమతో ఓట్లు వేయించుకున్నారని... నాలుగేళ్ళ తర్వాత తాము గుర్తొచ్చామా అంటూ ఎమ్మెల్యేని నిలదీశారు మెట్లవారిపల్లె గ్రామస్తులు. తాము ఉన్నామో.. పోయామో చూడటానికి వచ్చారా అంటూ నిలదీశారు, రోడ్లు వేస్తామని,తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామి ఇచ్చారని..కానీ గత నాలుగేళ్ళలో ఇవేమీ చేయలేదని ఆరోపించారు.ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తమ గ్రామానికి వచ్చావంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో అప్పటికప్పుడే గడపగడప కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోయారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నల్లగొండ జిల్లాలోని భట్టుగూడెం గ్రామానికి నేడు వెళ్లనున్నారు. తన మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్రెడ్డి స్వగ్రామం వద్ద నిర్మించిన ఫంక్షన్హాల్ను ఆయన ప్రారంభించనున్నారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డి భట్టుగూడెం వద్ద కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఈ ఫంక్షన్హాల్ను నిర్మించారు. ఆధునిక వసతులతో కూడిన 1000 మందికి సరిపడే ఫంక్షన్హాల్ను నిర్మించారు. ప్రారంభోత్సవానికి తన అల్లుడైన అల్లు అర్జున్తోపాటు మంత్రి జగదీశ్రెడ్డిని ఆయన ఆహ్వానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


